విశాఖా ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇప్పుడు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసారు. “విశాఖ రాంకీ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం, ఒకరు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. 

 

విశాఖ లో వరుస ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్, ఇప్పుడు రాంకీ ప్రమాదాలకు ఏం సమాధానం చెబుతారు? రాంకీ ఎస్ఈజెడ్ లో 15 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలి. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: