ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ మనదేశంలో విలయతాండవం చేస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలో కేసులు సగటున 25 వేలు దాటేసి 28 వేలకు చేరుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసులు 1.32 కోట్లు ఉంటే మరణాల సంఖ్య 5.75 లక్షలు ఉన్నాయి. ఇక మన దేశంలో కరోనా కేసులు 9 లక్షలు దాటేశాయి. కరోనా మరణాలు 23 వేలు దాటేసి పరుగులు పెడుతున్నాయి. ఇక్కడ ఏ రోజు కారోజు కరోనా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.
ఇదిలా ఉంటే గత మూడు వారాలుగా కరోనా దేశంలో స్వైరవిహారం చేస్తోంది. రెండు వారాల్లో దేశంలో కరోనా కేసులు 3 లక్షలకు చేరుకున్నాయి. ఇక ఆరు వేల మరణాలు సంభవించాయి. దీనిని బట్టి కరోనా ఇక్కడ ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కరోనాకు ఇక్కడ ఇప్పటకి అయినా కట్టడి చేయకపోతే వచ్చే ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా ప్రళయం సృష్టిస్తుందన్న అంచనాలు ఉన్నాయి.