ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు దూకుడు అదే విధంగా కొనసాగుతుంది. తాజాగా ఆయన సిఎం వైఎస్ జగన్ కు లేఖ ఒకటి రాసారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని ఆయన అన్నారు. 

 

వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారన్నారు ఆయాన. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా రూ. 1364 కోట్లు వసూలు చేసింది అని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇప్పటి వరకూ 330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన పేర్కొన్నారు. మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం చేయమంటూ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: