తమిళనాడు రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రజాప్రతినిధులు సైతం కరోనా  వైరస్ బారిన పడుతుండటం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుంది ఇటీవలే సీఎం క్యాంపు కార్యాలయంలో ఒకరూ కరోనా  వైరస్ తో మృతి చెందడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కరోనా  నిర్ధారిత పరీక్షలు చేసుకున్నారు. 

 

పళనిస్వామి తో పాటు సీఎం కార్యాలయంలో అధికారులు సిబ్బంది కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి కరోనా  టెస్ట్ లకు సంబంధించిన రిపోర్టర్లు ఇటీవలే వచ్చాయి. సీఎం పళని స్వామి కి కరోనా  నెగిటివ్ అని వచ్చిందని... అంతేకాకుండా సీఎం కార్యాలయంలోని ఏ ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ అని రాలేదు అంటూ అధికారులు వెల్లడించారు, ఇదిలా ఉంటే అటు రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ ను కంట్రోల్ చేసేందుకు పళనిస్వామి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: