ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా  వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకు పశ్చిమగోదావరి జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య పెరిగిపోతుంది. 

 

 తాజాగా ఏలూరులో పడమర వీధి లో ఒకే  ఇంట్లోని 12మంది కుటుంబ సభ్యులకు కరోనా  పాజిటివ్ అని రావడం సంచలనంగా మారిపోయింది. మొదట కుటుంబ యజమానికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ కాగా... యజమాని కుటుంబ సభ్యులందరికీ కరోనా  నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో ఒకే కుటుంబంలో ఏకంగా 12 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా  వైరస్ బారిన పడిన వారిలో వృద్ధులతో పాటు చిన్నారులు మహిళలు కూడా ఉన్నారు. ఇక ఒక్కసారిగా భారీగా కేసులు బయటపడడంతో చుట్టుపక్కల ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: