ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ సామాన్య ప్రజలకే కాదు ప్రజలకు రక్షణ కల్పిస్తున్న ఎంతో మంది అధికారులను సైతం పొట్టన పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా  వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా  వైరస్ బారినపడి డిప్యూటీ కలెక్టర్ కన్నుమూశారు. హుగ్లీ జిల్లాలోని చందర్ నగర్ సబ్ డివిజన్కు చెందిన డిప్యూటీ కలెక్టర్ దేబ్ దత్త రాయ్ కరోనా  బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. 

 

 గత వారం రోజుల క్రితం కరోనా  వైరస్ బారిన పడిన ఆమె... వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇక ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ కు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యం అందిస్తున్న సమయంలోనే డిప్యూటీ కలెక్టర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. కరోనా  సమయంలో హుగ్లీ జిల్లాకు రైళ్లలో వచ్చిన వలస కార్మికులను  తరలించే బాధ్యతను నిర్వర్తించిన క్రమంలోనే ఆమె  కరోనా  వైరస్ బారిన పడినట్లు  వైద్యులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: