సచిన్ పైలట్ చేతిలో ఏమీ లేదని... ఈ ప్రదర్శనను నడుపుతున్నది బిజెపి అంటూ రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.  బిజెపి ఆ రిసార్ట్ ఏర్పాటు చేసిందని... వాళ్ళు చెయ్యాల్సిన ప్రతీ ఒక్కటి కూడా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో పనిచేసిన అదే బృందం ఇక్కడ పనిలో ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. 

 

తప్పని పరిస్థితుల్లో హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆయన సచిన్ పైలెట్ ని తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై వ్యాఖ్యానిస్తూ అన్నారు. ఎందుకంటే చాలా కాలం నుండి బిజెపి కుట్రకు తెర తీసింది అని ఆయన మండిపడ్డారు. ఇది పెద్ద కుట్ర అని మాకు తెలుసన్నారు. ఇప్పుడు మా స్నేహితులు కొందరు దారి తప్పి ఢిల్లీ వెళ్ళారు అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: