దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో క్రైమ్ రేటు తగ్గిందని పోలీసులు చెప్పారు.  ఇటీవల లాక్ డౌన్ సడలింపులు చేసిన తర్వాత ఎవరి పనుల్లో వారు మళ్లీ నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా దొంగలు కూడా రెచ్చిపోతున్నారు. కొంత మంది కామాంధులు అత్యాచారాలకు పాల్పపడుతున్నారు.   తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో దారుణం జరిగింది. బంగారం కోసం ఓ మహిళలను దొంగ దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వసంత రాజ్యలక్ష్మి (65) హత్యకు గురైంది. అదే సమయంలో ఆమె ఇంట్లో సుమారు 15 కాసుల బంగారం కూడ చోరీ అయ్యింది.  ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని నింధితుడు మృతురాలి వంటిపై బంగారం కోసమే చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: