108 సర్వీసుల్లో ఉండే లోపాలను అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు. కుయ్, కుయ్, కుయ్ అన్నారు. కానీ అవి కుయ్యో, మొర్రో అంటున్నాయని లోకేష్ ఎద్దేవా చేసారు. కాల్ చెయ్యగానే 108 ఎక్కడ వైఎస్ జగన్ గారూ అంటూ ప్రశ్నించారు. స్కామ్ కోసం అనుభవం లేని సంస్థని రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని ఆయన ఒక వీడియో ని పోస్ట్ చేసారు.
అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు సమీపంలో హెడ్ మాస్టర్ నారాయణ స్వామి అస్వస్థత కి గురై నడి రోడ్డుపై పడిపోయారు. స్థానికులు 108 కి కాల్ చేసిన అంబులెన్స్ రాక ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. జగన్ రెడ్డి గారికి ప్రచార ఆర్బాటం పై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు.
కుయ్,కుయ్,కుయ్ అన్నారు.కానీ అవి కుయ్యో,మొర్రో అంటున్నాయి.కాల్ చెయ్యగానే 108 ఎక్కడ @ysjagan గారు.స్కామ్ కోసం అనుభవం లేని సంస్థని రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయి.(1/2) pic.twitter.com/YVLYzYuLRM
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 14, 2020