ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆస్పత్రుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేసారు. రోగుల దుస్థితి హైలైట్ అయిన తరువాత నెల్లూరు జనరల్ హాస్పిటల్‌లో ఇద్దరు నర్సులను సస్పెండ్ చేయడాన్ని చూడటం చాలా ఇబ్బందికరంగా ఉందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

 

సస్పెన్షన్ ఎల్లప్పుడూ సమస్యకు పరిష్కారం కాదన్నారు చంద్రబాబు. ప్రభుత్వం మద్దతు ఇవ్వనప్పుడు, స్పందించనప్పుడు వారు ఏమి చేస్తారని ప్రశ్నించారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో నర్సులు మన ఫ్రంట్‌ లైన్ సిబ్బందిఅని వారి రోజు వారి విధులను నిర్వహించడానికి వారి ప్రాణాలను మరియు ఆరోగ్యాన్ని పణంగా పెడతారన్నారు. వారి ధైర్యం దెబ్బ తీసే విధంగా నిర్ణయం తీసుకోవద్దు అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: