దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి అని కేంద్రం  చెప్పింది. 50 శాతం కేసులు మహారాష్ట్ర తమిళనాడు లో మాత్రమే ఉన్నాయి కేంద్రం ప్రకటించింది. ఇక్కడ మరో విషయం కూడా కేంద్రం తాజాగా తన ప్రకటనలో పేర్కొంది. కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆ రాష్ట్రాలే ముందు ఉన్నాయి. 

 

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా సరే ఆ రాష్ట్రాల్లో మాత్రం రికవరీ రేటు 65 శాతం పైగా ఉంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా ప్రసంశలు వస్తున్నాయి. ఏ మాత్రం కూడా భయపడకుండా ఆ రాష్ట్రాలు తమ వైద్య సేవలను పెంచుతున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో రికవరీ రేటు, చెన్నై లో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: