అయోధ్య రామ మందిరం విషయంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి చేసిన వ్యాఖ్యలు భారత్ లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. నిజమైన అయోధ్య నేపాల్ అంటూ ఆయన కామెంట్ చేసారు. దీనిపై బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్ ప్రధానికి లేదని ఆయన హెచ్చరించారు.
రాముని జన్మస్థలం ముమ్మాటికీ అయోధ్యనే అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. చైనా మెప్పు కోసం నేపాల్ ప్రధాని లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నేపాల్లో ఉన్న అనేక హిందు దేవాలయాలను పునరుద్ధరించాలని ఆయన సూచించారు. భారత్లో అనేకమంది నేపాల్ దేశస్తులు జీవిస్తున్నారన్న ఆయన.. ఇప్పటి వరకు నేపాల్కు భారత్ అండగా ఉంది కాబట్టే ఇంకా చైనా నేపాల్ను ఆక్రమించలేదన్నారు.