కరోనా కాలంలో ప్రజలకు ఇతర జబ్బులు చేసినా ప్రైవేటు ఆస్పత్రుల వాళ్లు చేర్పించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపణలు చేసారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని ఆయన ఆరోపించారు.  ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే చనిపోతామని ప్రజలు భయపడుతున్నారన్ని ఆయన అన్నారు. సంగారెడ్డిలో ఇటీవల టోపి బాబా అనే వ్యక్తి చనిపోయారని ఆయన మండిపడ్డారు. 

 

ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలన్న ఆయన... ప్రైవేట్ ఆస్పత్రులకు ఎవరు వచ్చినా జాయిన్ చేసుకుని చికిత్స అందించాలని కోరారు. తానే గనుక మంత్రిగా ఉంటే గవర్నమెంట్ ఆస్పత్రిలో మంచం వేసుకుని ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇప్పుడు అసలు రాజకీయాలు చేయడం లేదు అని ప్రజల ఆరోగ్యం కోసం మాత్రమే ఆలోచిస్తున్నా అన్ని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: