విశాఖ  ఫార్మా సిటీ ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో కమిటీ వేసారు. ఈ నేపధ్యంలో కంపెనీ పై కేసు కూడా నమోదు చేసారు పోలీసులు. ఒక నిల్వ ఉంచిన రసాయనం కారణంగా ఈ ప్రమాదం జరిగింది అని కలెక్టర్ వినయ్ చంద్ మీడియాకు వివరించారు. కంపెనీలో ఉన్న వాస్తవ పరిస్థితిని కూడా ఈ కమిటి తెలుసుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. 

 

కంపెనీ మీద 338 తో పాటుగా 340 ఏ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసింది పోలీసు శాఖ. అయితే ఇప్పటి వరకు ఎవరిని అయినా అదుపులోకి తీసుకున్నారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. కాగా నిన్న సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: