రాజస్థాన్ లో తమను ఇబ్బంది పెట్టాలి అని భావించిన వారికి కాంగ్రెస్ అధిష్టానం చుక్కలు చూపించింది. ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా కీలక నేతలను కూడా పదవుల నుంచి తప్పిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఈ నేపధ్యంలో తాజాగా మంత్రి పదవి కోల్పోయిన విశ్వేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేసారు. 

 

మేము పార్టీ వ్యతిరేక ప్రకటనలు ఎం చేసామని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించారు. మా మ్యానిఫెస్టోలోని వాగ్దానాలను హైకమాండ్ దృష్టికి తీసుకుని వెళ్లామని ఆయన అన్నారు. అధికారంలో ఉన్న ఈ రెండేళ్లలో తాము హామీలను నెరవేర్చలేదు అని అందుకే తాము ఇలా అడుగు వేశామని ఏ తప్పు చేసామని చర్యలు తీసుకున్నారు అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: