గత ప్రభుత్వం అంచనాలను ఎప్పుడు అందుకోలేదు అని ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఆరోపించారు. రెండంకెల ఆర్ధిక వృద్ది ఎప్పుడు జరిగింది అని ఆయన నిలదీశారు. 2019 నుంచి ఆర్ధిక మాంద్యం ఉందని  ఆయన పేర్కొన్నారు. 2018-2019 ఆర్ధిక ప్రగతి ఎక్కడ సాధించారు అని  టీడీపీని నిలదీశారు. 

 

మూడేళ్ళ నుంచి వరుసగా అంచనాలు తగ్గాయి అన్నారు. యనమల చెప్పే లెక్కలకు అసలు పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. యనమల చెప్పే దానిలో  వాస్తవాలు లేవు బుగ్గన అన్నారు. ప్రతీ ఒక్కటి అబద్దాలతో కాలం నెట్టుకొచ్చారు అని ఆయన  ఆరోపించారు. 2019- 20 ఆర్ధిక మాంద్యం కారణంగానే దేశం మొత్తం కూడా ఆదాయం తగ్గింది అని అన్నారు. ఒక్క ఏపీలో మాత్రమే కాదని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: