గాంధీ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో కరోనా  రోగుల పరిస్థితి దారుణంగా ఉంది అంటూ పలు వీడియోలు బయటికి వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో దారుణ ఘటన కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే శ్రీనివాస్ అనే వ్యక్తి కరోనా  బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ రోజు ఉదయం 8 గంటలకు  శ్రీనివాస్ మృతిచెందగా ఉదయం నుంచి రాత్రి 8 వరకు మృతదేహం బెడ్  పైనే ఉంది. 

 


 సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ మృతదేహాన్ని తరలించక పోవడంతో మృతదేహం దుర్వాసనతో కంపు కొడుతూ వార్డులో ఉన్న మిగతా రోగులకు ఎంతో ఇబ్బంది గా మారిపోయింది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆస్పత్రిలో పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అని మిగతా రోగులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా రోజురోజుకు గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం బయట పడుతుండడం అందరిలో మరింత భయాందోళనకు గురిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: