వరుసకు మరిది అయ్యే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న ఓ కసాయి భార్య కట్టుకున్న భర్తను చంపేసింది. ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో సోమవారం సాయంత్రం ఆలస్యంగా బయటకు వచ్చింది. నందిగామ మండలం చేగూరుకు చెందిన బైండ్ల చెన్నయ్య(38), శశికళ దంపతలు. వీరికి బాబు ప్రవీణ్, కూతురు పావని ఉన్నారు. చెన్నయ్యకు తాగుడు అలవాటు ఉంది. భార్య అదే గ్రామానికి చెందిన మరిది అయ్యే రమేశ్తో ఆరేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి అడ్డొస్తున్న భర్తను తొలగించుకోవాలని ప్లాన్ వేసింది.
ఈ క్రమంలోనే తాగుడు మందు మాన్పించే మందు పోస్తున్నారని భర్తను నమ్మించి అనంతగిరికి ప్రియుడితో కలిసి తీసుకు వెళ్లింది. అక్కడ లోయలోకి తోసి... ఆపై అతడి మీద పెద్ద బండరాయి పడేసి హత్య చేశారు. మృతదేహం పొదల్లో వేశారు. ఇక చెన్నయ్య తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తలకొరివి పెట్టేందుకు చెన్నయ్య లేకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు సర్పంచ్ సమక్షంలో భార్యను, అనుమానం వచ్చి రమేశ్ను గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. అయితే తాము చేసిన తప్పు బయటకు రావడంతో శశికళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.