దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు ఏకంగా దాదాపు 30 వేల వరకు వచ్చాయి అంటే తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రికార్డ్ స్థాయిలో గత 24 గంటల్లో కేసులు నమోదు అయ్యాయి.

 

 భారతదేశంలో గత 24 గంటల్లో 29,429 కొత్త కరోనా కేసులు & 582 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసులు 9,36,181 గా ఉన్నాయి అని కేంద్రం పేర్కొంది. వీటిలో 3,19,840 క్రియాశీల కేసులు ఉన్నాయని వివరించింది. 5,92,032 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారని కేంద్రం వివరించింది. 24,309 మంది కరోనా బారిన పడి మరణించారు అని వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: