ఈ మద్య కొంత మంది దుర్మార్గులు ఆడవారు కనిపిస్తే కామంతో రెచ్చి పోతున్నారు.  నిర్భయ, దిశ లాంటి కేసుల్లో ముద్దాయిలకు కఠిన శిక్ష పడినా.. ఇలాంటి రాక్షసుల తీరు మారడం లేదు.  చిన్న వయసు పిల్లల నుంచి వృద్దులపై అత్యాచారాలకు పాల్పపడుతున్నారు.  ఆ మద్య వరంగల్ లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు.. రీసెంట్ గా తమిళనాడులో ఏడు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇలాంటి వారికి మరణ శిక్షలు విధిస్తే తప్ప బుద్దిరాదని మహిళా సంఘాలు కోరుకుంటున్నారు. 

 

తాజాగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం బసవరాజు పాలెంలో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల చిన్నారిపై 35 ఏళ్ల ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళితే.. మేకలు కాపుకుంటున్న ఓ బాలికను అదే గ్రామానికి చెందిన నిందితుడు  మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పపడ్డాడు. 

 

సదరు బాలిక నిందితుడికి కూతురు వరుస అవుతుంది. కాగా, జరిగిన విషయాన్ని బాలిక తన ఇంట్లో చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: