విప్లవ రచయితల సంఘం నేత వరవరావు ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి తడోబా జైలు లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోలతో కలిసి కుట్ర చేసారు అని పోలీసులు, ఎన్ఐఏ ఆరోపిస్తున్నాయి. ఈ మేరకు ఆయనను జైలు లో ఉంచి విచారిస్తుండగా ఆయన ఆరోగ్యం కూడా ఇప్పుడు కాస్త విషమంగా మారింది. ఈ నేపధ్యంలో ఆయనను బయటకు తీసుకురావాలి అని పలువురు కోరుతున్నారు. తాజాగా టీడీపీ జాతియ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసారు.
ప్రసిద్ధ రచయిత,విరసం నేత వరవరరావు గారికి మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగారికి విన్నవిస్తున్నాను. వృద్దాప్య, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావుకి అత్యాధునిక వైద్యం తక్షణమే అందించాలని మహారాష్ట్ర సీఎం గారిని కోరుతున్నానని అన్నారు.
ప్రసిద్ధ రచయిత,విరసం నేత వరవరరావు గారికి మెరుగైన వైద్యం అందించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిగారికి విన్నవిస్తున్నాను. వృద్దాప్య, అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావుకి(1/2) pic.twitter.com/SMecYyj0To
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 15, 2020
అత్యాధునిక వైద్యం తక్షణమే అందించాలని మహారాష్ట్ర సీఎం గారిని కోరుతున్నాను.(2/2)
— lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) July 15, 2020