అనంతపురం జిల్లాలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ పోలీసులు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు. 47 ఏళ్ళ ఆయన అనంతపురం పట్టణంలో ట్రాఫిక్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు మధుమేహం కూడా ఉన్న నేపధ్యంలో కరోనా రావడం ఆయన ఆరోగ్యంపై తీవ్ర  ప్రభావం చూపించింది. 

 

ఆయన ఆరోగ్యం విషమించిన నేపధ్యంలో హైదరాబాద్‌కు మెరుగైన వైద్యం కోసం తరలించే క్రమంలో ఆయన ఆరోగ్యం కర్నూలు దాటిన తర్వాత విషమంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించారు. ఆయన మరణించడంతో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తో పాటుగా పలువురు పోలీసులు సంతాపం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: