తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక దిగ్గజం అయిన రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్  అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సూపర్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో  మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు అనే విషయం తెలిసిందే. 

 

 దీంతో దర్శక ధీరుడు రాజమౌళి తన ఫామ్ హౌస్ కి మకాం మార్చినట్లు టాలీవుడ్  వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నల్గొండ జిల్లా నార్కట్పల్లి సమీపంలో ఏదులూరు గ్రామంలో ఉన్న ఫామ్ హౌస్ కి రాజమౌళి వెళ్ళాడట. కొంత  కాలం పాటు ఫామ్  హౌస్ లోనే ఉంటూ స్క్రిప్ట్ లో  మరిన్ని మెరుగులు దిద్దేందుకు సిద్ధమయ్యాడట  రాజమౌళి. ఇదే క్రమంలో ఎం.ఎం.కీరవాణి ని  కూడా తన వెంట తీసుకెళ్లినట్లు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతోంది,

మరింత సమాచారం తెలుసుకోండి: