తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. కరోనా  వైరస్ పై  ఢిల్లీ ప్రభుత్వం ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకుని ఉంటే..  విఫలమయ్యే వారం అంటూ చెప్పుకొచ్చారు. కరోనా  పోరాటంలో తాము ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయాము  అంటూ వ్యాఖ్యానించిన కేజ్రీవాల్.. కేంద్ర ప్రభుత్వం,  ప్రభుత్వేతర సంస్థలు,  మతపరమైన సంస్థలు కూడా ప్రభుత్వానికి ఎంతగానో సహాయ సహకారాలు అందించాయి అంటూ చెప్పుకొచ్చారు. 

 

 కరోనా పోరాటంలో ప్రభుత్వానికి మద్దతు కావాలంటూ ఇతర పార్టీలను కూడా తాము కోరినట్లు తెలిపారు కేజ్రీవాల్. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తమకు మద్దతు ప్రకటించాయని.. కరోనా  సంక్షోభంలో విమర్శలకు పోకుండా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ప్రతిపక్ష పార్టీల కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వం అందరినీ కలుపుకు పోతూ కరోనా  వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాము అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: