కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లడక్ పర్యటన ఖరారైంది. ఈ నెల 17, 18 తారీకుల్లో లడక్ లో  పర్యటించనున్నారు రాజ్ నాథ్ సింగ్ . ఆ వెంటనే భారత ఆర్మీ చీఫ్ నరవాణే ను  కూడా కలువనున్నారు   కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అయితే ప్రస్తుతం చైనా భారత్ మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగిన నేపథ్యంలో తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. 

 

 గతంలోనే రాజ్ నాథ్ సింగ్  లడక్ లో  పర్యటించాల్సి ఉండగా ఎవరూ ఊహించని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ లడక్ లో ఆకస్మిక పర్యటన చేసిన విషయం తెలిసిందే. ఆర్మీ అధికారులతో సమావేశమైన నరేంద్రమోడీ పలు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు తన ప్రసంగంతో సైనికుల్లో  మరింత ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపారు. ఇక ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్  పర్యటనలో ఏం చర్చించనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: