కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ నల్గొండ జిల్లా మర్రిగూడెం లెంకల  పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను  ఆశ్రయించింది. తమ పేరు మీద పట్టా ఉన్న భూమిని గ్రామ మాజీ సర్పంచ్ ప్రస్తుత కాంగ్రెస్ సర్పంచులు కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత రైతు యాదయ్య మానవహక్కుల కమిషన్ కు తెలిపారు. ఇదేంటని ప్రశ్నించినందుకు తన తండ్రిని తమ్ముడిని కత్తులతో విచక్షణారహితంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై కేసు నమోదు చేయాలని వాపోయారు బాధితులు. రాజి కుదుర్చుకోవాలని లేకపోతే తమ మీదే రిటర్న్ కేసులు పెడతామంటూ పోలీసులు భయబ్రాంతులకు గురి చేశారు అంటూ మనవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నుంచి కూడా తమ కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ చెప్పుకొచ్చారు బాధితులు.

మరింత సమాచారం తెలుసుకోండి: