ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 2432 మందికి కరోనా సోకింది అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 35 వేల 451 పాజిటివ్ కేసు లకు గాను 18 వేల 378 మంది కోలుకుని బయటపడ్డారు. 

 

ఇప్పటి వరకు రాష్ట్రంలో 452 మంది మరణించారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 16,621 మంది అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గత 24  గంటల్లో ఏకంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 44 గా ఉంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 468 మందికి కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: