ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షలు చాలా వేగంగా జరుగుతున్నాయి. కరోనా కేసులు మొదలైనప్పుడు  ఒకటి రెండు పరిక్షలు చేయడానికి  నానా ఇబ్బందులు పడిన ఏపీలో ఇప్పుడు ప్రతీ రోజు 20 వేలకు పైగా కరోనా పరిక్షలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.  సిఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. 

 

గత 24  గంటల్లో ఏపీలో 22 వేల 197 మందికి కరోనా పరిక్షలు చేసారు. ఇప్పటి వరకు చేసిన పరిక్షలు 12 లక్షలు దాటాయి అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 12 లక్షల 17 వేల 963 మందికి కరోనా పరిక్షలు చేసారు. అయితే కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయి.  నేడు ఒక్క రోజే 2500 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: