టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేసారు. విశాఖ కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 

 

విశాఖ ప్రజలు అటు కరోనా వైరస్ తో  మరో పక్క విజయసాయిరెడ్డి చేష్టలకు భయపడుతున్నారని ఆయన విమర్శలు చేసారు. విశాఖలో జరిగే ప్రతి సంఘటనలో విజయసాయిరెడ్డి హస్తం కచ్చితంగా ఉందని ఆయన విమర్శించారు. విశాఖను జగన్ చేతిలో పెట్టడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేసారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి కూడా కోటి రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. ఎల్జీ పాలిమర్స్ స్థాయిలో కమిటీ వేయాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: