కరోనా వైరస్ దెబ్బకు దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు అల్లాడిపోతున్నాయి. జనాభా తక్కువగా ఉండే రాష్ట్రాలు కూడా ఇప్పుడు కరోనా మహమ్మారి దెబ్బకు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాయి. కరోనా కేసులు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు లో చాలా వేగంగా పెరుగుతున్నాయి. కేరళ ఒక్క రాష్ట్రంలోనే వెయ్యి కేసుల లోపు నమోదు అవుతున్నాయి.
మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అయితే దాదాపు ప్రతీ రోజు రెండు వేల కేసులు నమోదు అవుతున్నాయి. తమిళనాడులో 4 వేల పైమాటే. దేశంలో మహారాష్ట్ర తర్వాత బాగా ప్రభావితం అవుతున్న రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలే. దీనితో ఇప్పుడు ఈ రాష్ట్రాలలో పరీక్షలను కూడా వేగంగా చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.