మహారాష్ట్రలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి సమర్ధవంతంగా పని చేసినా సరే కేసులు మాత్రం ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇక కరోనా  దెబ్బకు అక్కడ మళ్ళీ రెండో దశ లాక్ డౌన్ ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ధారావీ లో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగాయి. 

 

ముంబైలోని ధారావి ప్రాంతంలో ఈ రోజు 23 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు పేర్కొన్నారు. 99 క్రియాశీల కేసులు ధారావీ లో ఉన్నాయి అని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ప్రకటించింది. మొత్తం కేసులు అక్కడ 2415 గా ఉన్నాయి అని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: