స్టాక్మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 274 పాయింట్లు నష్టపోయి 25,036 సూచీ వద్ద అదేవిధంగా నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 7,613 సూచీ వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.86గా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల సవరణతోపాటు ,జిఎస్టి బిల్లకు సంబంధించి నెలకొని ఉన్న సందిగ్ధత మార్కెట్లలో కొంత ఒడిదుడుకులకు కారణమైంది. మరోవైపు యూఎస్ డాలర్ విలువతో పోల్చితే రూపాయి 6 పైసలు లాభపడి మారకం విలువ 66.78గా ఉంది.