ట్రేడ్ వార్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారనే వార్తలతో అంతర్జాతీయంగా మార్కెట్లు కుదేలయ్యాయి. వీటి ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడింది. ఫలితంగా వరుసగా ఆరో రోజు కూడా మన మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇక ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో పాటు కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో... ఈ ఉదయం నుంచి మన స్టాక్ మార్కెట్లు జోరుగానే కొనసాగాయి.

కానీ, చివరి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి.   దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.  ఆరంభంలో ఒడిదొడుకుల మధ్య సాగుతున్న మార్కెట్లు లాభాలతో  మళ్లాయి.  తిరిగి అమ్మకాల  ఒత్తడితో  సెన్సెక్స్‌ 44పాయింట్లు  నష్టంతో 33,307వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు  నష్టంతో 10,226 వద్ద ముగిసింది.  


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సెంట్రల్ బ్యాంక్ (9.68%), ఇన్ఫో ఎడ్జ్ ఇండియా (7.84%), డీబీ కార్ప్ (6.13%), రతన్ ఇండియా పవర్ (6.07%), ఒబెరాయ్ రియాలిటీ (5.39%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-9.74%), అదానీ ఎంటర్ ప్రైజెస్ (-7.64%), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (-6.40%), కెనరా బ్యాంక్ (-6.09%), ఐడీబీఐ బ్యాంక్ (-5.54%).


మరింత సమాచారం తెలుసుకోండి: