ఇండియా మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ ఎంఐ ఇయర్ఫోన్స్, ఎంఐ ఇయర్ఫోన్స్ బేసిక్ పేరిట రెండు కొత్త ఇయర్ఫోన్ మోడల్స్ను ఇండియాలో విడుదల చేసింది. ఇప్పటికే కొత్త కొత్త ఫీచర్స్ తో మొబైల్ రంగంలో దిగ్గజంగా ఉన్న షియోమీ లేటెస్ట్ గా ఇయర్ఫోన్స్, ఎంఐ ఇయర్ఫోన్స్ బేసిక్ పేరిట రెండు కొత్త బ్లాక్, సిల్వర్ రంగుల్లో ఇయర్ఫోన్ మోడల్స్ రిలీజ్ చేశారు.
ఈ ఇయర్ఫోన్ బయట రూ.699 ధరకు లభిస్తుండగా, ఎంఐ ఇయర్ఫోన్స్ బేసిక్ ఇయర్ఫోన్లు రూ.399 ధరకు లభిస్తున్నాయి. వీటిని ఎంఐ ఆన్లైన్ స్టోర్లో యూజర్లు కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ 5, రెడ్మీ నోట్ 5 ఫోన్లతో ఈ ఇయర్ఫోన్స్ను కలిపి కొంటే రూ.100 వరకు డిస్కౌంట్ను అందిస్తున్నారు.
నాణ్యమైన సౌండ్ అవుట్పుట్ వీటిలో లభిస్తుంది. డైనమిక్ బేస్ అనే ఫీచర్ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతో ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే వాయిస్ కాల్స్ ఆన్సర్, కట్ చేయడానికి, సాంగ్స్ వినేటప్పుడు ప్లే, పాజ్కు ప్రత్యేకంగా బటన్లను ఇచ్చారు.