భారత్‌లో అతి తక్కువ చౌక ధర కలిగిన స్మార్ట్ టీవీని ఢిల్లీకి చెందిన సామీ ఇన్ఫర్మాటిక్స్ అనే కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మద్య తరగతి కుటుంబీకుల బడ్జెట్ కి అందుబాటులో ఈ స్మార్ట్ టీవి తీసుకు వస్తున్నట్లు కంపెనీ వారు ప్రకటించారు. ఈ టీవీని పేదల కోసమే రూపొందించినట్లు సామీ ఇన్ఫర్మాటిక్స్ కంపెనీ అధికారులు తెలిపారు.   ఈ టీవీ ధర రూ.4,999 మాత్రమే. సాధారణంగా 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అంటే తొమ్మిది వేల నుంచి రూ.12వేల మధ్య వుంటుంది. కాస్త చిన్న సైజ్ టీవీ అయితే రూ.15వేల వరకు వుంటుంది. 


న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం భారత మార్కెట్లో అతి తక్కువ ధరకు లభించే స్మార్ట్ టీవీ ఇదేనని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ టీవీలో 1366×786 హెచ్డీ రిజల్యూషన్, 10 వాట్ స్పీకర్స్, 512 జీబీ స్టోరేజ్, ఎస్ఆర్‌ఎస్‌ డాల్బీ డిజిటల్‌, 5 బ్యాండ్‌) ఇన్‌ బిల్ట్‌ వైఫై కనెక్టివీటీ, స్క్రీన్‌ మిర్రరింగ్‌ సౌకర్యాలుంటాయని, ఫేస్‌ బుక్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌ వినియోగించుకోవచ్చు. 


ఈ టీవీ ఆండ్రాయిజ్ 4.4 కిటిక్యాట్‌తో పనిచేస్తుంది. 2హెచ్డీఎమ్ఐ 2 యూఎస్‌‌బీ పోర్ట్స్‌ను కలిగివుంటుంది. రెండు 10డబ్ల్యూ స్పీకర్‌ను ఇది కలిగివుంటుంది. ఈ టీవీని ఆర్డర్ చేయాలన్నా.. కొనుగోలు చేయాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.


మరింత సమాచారం తెలుసుకోండి: