ప్రస్తుతం ఎక్కడ ఎవరి నోట విన్నా ఆర్గానిక్ అనే మాట వినిపిస్తోంది. ఆర్గానిక్ కాయగూరలు, పళ్లు అంటే సేంద్రీయ ఎరువులు వేసి సహజ పద్ధతుల్లో పండించినవని మనకు తెలుసు. అందుకే అవి ఆరోగ్యానికి మంచివని కొంచెం ఖరీదు ఎక్కువైనా కొనుగోలు చేస్తుంటాం. ముఖ్యంగా పళ్ల రసాలకి ఆర్గానిక్ పళ్లే దిక్కు. ఎందుకంటే పళ్లరసాలు త్వరగా జీర్ణమై మన శరీరంలో కలిసిపోతాయి. ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. ఆ పళ్లరసం పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వేసి, రసాయనిక ఎరువులు వాడి పండించిన పళ్లనుంచి తయారు చేసినట్లయితే... పళ్లరసం తీసుకున్న వెంటనే విష పదార్థాలు నేరుగా మన శరీరంలో కలిసిపోతాయి. దానివల్ల అప్పటికప్పుడు ఆరోగ్యం పాడు కావడంతో పాటు... భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.
ఆపిల్స్కు ఉన్నఉన్న లేబుల్స్పై నాలుగు అంకెలు ఉండి, మొదటి అంకె మూడు లేదా నాలుగు ఉంటే రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి పండించిన పంట అని తెలుసుకోవాలి.
ఇక పళ్లపై ఉన్నన లేబుల్స్లను పిల్లలు చూసుకోకుండా తినేస్తే గాభరా పడాల్సిన అవసరం లేనేలేదు. ఆ లేబుల్ కాగితాన్ని తినదగిన పేపర్తోనే తయారు చేస్తారు. అంతేకాదు.. ఆ లేబుళ్లను అతికించడానికి ఉపయోగించే జిగురు సైతం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలతోనే తయారవుతుందట.