అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకున్న రిలయన్స్ జియో.. ఆ తర్వాత టారీప్ ప్లాన్స్ తీసుకొచ్చినా.. క్రమంగా యూజర్లు భారీగా పెరుగుతూ పోయారు. దీనికి డేతాతో పాటు ఏ నెట్వర్క్కు అయినా ఎంత సమయమైనా ఉచితంగా మాట్లాడుకునే వెసులుబాటు ఉండడమే ప్రాధాన కారణంగా చెప్పుకోవచ్చు.
జియోకు తగిలిన దెబ్బకు మిగతా టెలికం సంస్థలు కూడా ఈ తరహా ప్లాన్స్ తీసుకొని రావాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా మినహాయింపు కాకుండా పోయిన పరిస్థితి. అయితే, ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ)పేరుతో చార్జీలు వసూలు చేయనున్నట్టు ప్రకటించింది జియో. దీంతో జియో కాకుండా మిగతా నెట్వర్క్లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని జియో తెలియచేసింది. ఈ విషయం పై వినియోగదారుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ ప్రకటన రాకముందే రీచార్జ్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి? అనే పలు అనుమానాలు కూడా మొదలయ్యాయి. దీంతో దీనిపై క్లారిటీ ఇస్తూ మరో ప్రకటన విడుదల చేసింది జియో.
అక్టోబర్ 9 లేదా అంతకంటే ముందే రీచార్జ్ చేసుకున్నవారు ఈ ఐయూసీ చెల్లించాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది రిలయన్స్ జియో.. నాన్-జియో నెంబర్లకు వారి ప్రస్తుత ప్లాన్ ముగిసే వరకూ ఉచితంగానే కాల్స్ చేసుకునే అవకాశం ఉంది స్పష్టత ఇచ్చింది. ఇక, నాన్-జియో నంబర్లకు కాల్ చేయడానికి, కొత్త ఐయూసీ టాప్-అప్ వోచర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ వోచర్లు రూ. 10 నుంచి ప్రారంభమై రూ.100 వరకు ఉంటాయని ప్రకటించింది.
ఇక అసలు విషయానికి వస్తే డేటాకు మాత్రమే ఛార్జీ... జీవితకాలం ఉచిత కాల్స్ నినాదంతో సేవలు ఆరంభించిన రిలయన్స్ జియో, అందుకు విరామం పలుకుతుంది ఈనాడు తెలియచేసింది. ఒఇక ఒక నెట్వర్క్ వినియోగదారులు వేరొక నెట్ వర్క్ పరిధిలోని ఫోన్లకు కాల్స్ చేస్తే, కాల్ అందుకున్న నెట్ వర్క్కు తొలి సంస్థ ఛార్జీ చెల్లించాలన్న (ఐయూసీ) ఆదేశాలు అమల్లో ఉన్నంత వరకు కాల్ ఛార్జీలు కొనసాగుతాయని జియో స్పష్టం తెలిపింది. అయితే, జియో నెట్వర్క్ నుంచి జియో ఫోన్ల మధ్య చేసుకునే కాల్స్ మాత్రమే ఉచితం అని తెలిపింది.