బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడటంతో
పసిడి ధర పడిపోయింది.
హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గగా ...ఇటు 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.120 దిగొచ్చింది. దీంతో
24 క్యారెట్ల బంగారం
ధర రూ.40,000కు....
10 గ్రాముల 22 కార్యెట్ల బంగారం ధర రూ.36,660కు
క్షీణించింది. పసిడి ధర ధర పడిపోయునా వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగింది. దీంతో కేజీ వెండి ధర రూ.47,500 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.అటు ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధర దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గడంతో ధర రూ.38,650కు క్షీణించింది.
అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 పడిపోవడంతో ధర రూ.37,450కు క్షీణించింది.ఇక్కడ కూడా బంగారం ధర తగ్గినా వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ధర రూ.47,500 వద్దనే కొనసాగుతోంది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు కారణం.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అలాగే అంతర్జాతీయ మార్కెట్లో సైతం బంగారం ధర దిగొచ్చింది. ఔన్స్కు 0.16 శాతం తగ్గుదలతో 1,495.15 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్కు 0.26 శాతం క్షీణతతో 17.56 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.