భారతీయ టెలికం కంపెనీలకు తాజాగా పెద్ద షాక్ తగిలింది. ఏది ఏమయినా 14ఏళ్ల సుదీర్ఘ పోరాటం ముగిసింది.ఏజీఆర్ ఫీజుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నిచ్చింది.వడ్డీతో సహా జరిమానా కట్టాల్సిందే ఇక. చార్జీల వసూలుపై సుప్రీంకోర్టు కేంద్రానికి అనుకూలం గా తీర్పు ఇచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం అయిన డాట్ నిర్దేశించిన అడ్జెస్టెట్ గ్రాస్ రెవెన్యూని సమర్థిస్తూ సుప్రీం కోర్ట్ గురువారం తీర్పు నిచ్చారు.
దీనికి డాట్ విధించిన జరిమానాతో పాటు వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు చెప్పింది. టెల్కోలు లేవనెత్తిన అంశాలను కొట్టిపారేయడమే కాకుండా.. వడ్డీ తో సహా జరిమానా చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఏఏ నజీర్, ఎంఆర్షాలతోకూడిన సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దీంతో ఏజీఆర్ ఫీజుపై మొబైల్ ఆపరేటర్లు, ప్రభుత్వానికి మధ్య సాగిన 14 సంవత్సరాల న్యాయ పోరాటం ఎట్టకేలకు ముగిసింది అని చెప్తున్నారు.
అంటే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి దాదాపు రూ .92,642 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది, అందులో సగానికి పైగా ఎయిర్టెల్, వొడాఫోన్ సంస్థ వారు చెల్లించాల్సి ఉంది. డాట్ లెక్కల ప్రకారం
భారతి ఎయిర్టెల్ రూ .21,682 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ .28,309 కోట్లు, ఎమ్ టీఎన్ ఎల్ రూ.2 వేల 537కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. డాట్ రూల్స్ ప్రకారం అడ్జెస్టెట్ గ్రాస్ రెవెన్యూ లో ఎనిమిది శాతం లైసెన్సు ఫీజుగా వారు చెల్లించాలి.
ఏజీఆర్ స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు , లైసెన్సింగ్ ఫీజులుగా విభజించారు.
ఐదుశాతం ఎస్యూసీతోపాట, ఎక్కువ స్పెక్ట్రాన్ని సేకరించిన మొబైల్ సంస్థ ఓటీఎస్సీ కూడా చెల్లించాలి అని చెప్తున్నారు. ఒక్కో సర్కిల్ లో 4.4 మెగాహెజ్ ల కంటే ఎక్కువ స్పెక్ట్రం ఉన్నా మార్కెట్ ధరలు కట్టక తప్పదు అంటున్నారు. మరోవైపు ఈ తీర్పుతో
భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ షేర్లు 4.9 శాతం, వోడాఫోన్ ఐడియా 13.3 శాతం పతనాన్ని నమోదు అయ్యాయి.మొబైల్ ఆపరేటర్ల నెత్తిన పిడుగు పడినట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు.