పసిడి ధర రోజురోజుకి తగ్గుతూ వస్తోంది. హైదరాబాదులో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గింది. దీనితో ధర రూ.39,650 కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ కాస్త మందగించడంతో బంగారం ధర పై ప్రతికూల ప్రభావం ఉండిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


అదే సమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.230 తగ్గింది. దీనితో ధర రూ.36,350కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పడిపోయింది. ఇక వెండి రూ.150 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,600 కు చేరింది. ఢిల్లీ మార్కెట్‌ లో కూడా బంగారం ధర దిగి వచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గింది, దీనితో ధర రూ.38,370 కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.250 తగ్గుదలతో రూ.37,100 కు చేరుకుంది.


బంగారం ధర పడిపోతే, వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. కేజీ వెండి ధర రూ.150 లకు క్షీణించింది. దీనితో ధర రూ.48,600 కు వచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే కొనసాగాయి. 


అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర కాస్త పడిపోయింది. ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదలతో 1,459.60 డాలర్లకు క్షీణించింది. అదే సమయంలో వెండి ధర ఔన్స్‌కు 1.44 శాతం క్షీణతతో 16.76 డాలర్లకు తగ్గింది. బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం అందరికి తెలిసిందే. బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: