కొత్త
ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా...? అయితే మీకు ఒక శుభవార్త.. కొత్త
ఫోన్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఆ అవసరం లేకుండానే ఉచితంగా స్మార్ట్ఫోన్ గెలుచుకునే ఆఫర్ ఇప్పుడు ఒకటి అందుబాటులో ఉంది. ఏంటి అనుకుంటున్నారా..?? అది కూడా ఏ ఎంట్రీ లెవెల్, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ కూడా కాదు. ఏకంగా శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ
ఫోన్ ధర దాదాపుగా రూ.80,000 ఉంటుందట. అదేలా.. ఏంటి.. అనుకుంటున్నారా..? జర సూడుర్రి మరి..!!
పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రొడక్ట్ అయిన యాపీ ఫిజ్ తన వినియోగదారులకు స్మార్ట్ఫోన్లను బహుమతిగా ఇస్తోంది. ప్రమోషన్లో భాగంగా నాలుగు శాంసంగ్ గెలాక్సీ 10 ప్లస్ స్మార్ట్ఫోన్లను గ్రాండ్ ప్రైజ్గా అందివ్వనుంది. నవంబరు 7 నుంచి 22 వరకు ఈ పోటీ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు.
స్మార్ట్ఫోన్ గెలవాలంటే ఏం చేయాలి అనుకుంటున్నారా..? దేశ వ్యాప్తంగా యాపీ ఫిజ్ కాంటెస్ట్ అందుబాటులో ఉంది. @iamappyfizz పేజీని ఫాలో కావాలి. యాపీ ఫిజ్ డ్రింక్తో కలిపి మీరు ఏ ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారనే విషయాన్ని ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో షేర్ చేయాలి. తర్వాత కాంటెస్ట్లో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులను ఆహ్వానించాలి. ఇలా చేస్తే మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. వీక్లి మార్చ్ కింద 60 మంది లక్కీ విజేతలు ఆర్ట్ఆఫ్ఫిజ్ కాక్టైల్ కిట్స్ గెలుచుకోవచ్చు. అలాగే గ్రాండ్
ప్రైజ్ కింద నలుగురు విజేతలు ఏకంగా శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్ను గెలుచుకోవచ్చు.
కాగా దక్షిణ భారతంలో యాపీ ఫిజ్ ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు
నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ట్విటర్ ఖాతాలో ఈ కాంటెస్ట్ గురించి పోస్ట్ చేశారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. దీంతో అటు యాపీ ఫిజ్ ఫ్యాన్స్, ఇటు యంగ్టైగర్ ఫ్యాన్స్ ట్విటర్లో ఇమేజ్లు, వీడియోలతో సందడి చేస్తున్నారు. పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలి.