పసిడి ధర మళ్లీ కాస్త పెరిగింది.
హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగింది. దీంతో ధర రూ.39,940 కు వచ్చి చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధర పై సానుకూల ప్రభావం చూపిందని
మార్కెట్ నిపుణులు అంటున్నారు. అదే సమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.280 వరకూ పెరిగింది. దీనితో ధర రూ.36,620 కు చేరింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే
వెండి కూడా పయనించింది.
వెండి రూ.70 పెరిగింది. దీనితో కేజీ
వెండి ధర రూ.48,840కు వచ్చి చేరింది.
ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధర బాగా పెరిగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరుగుదలతో రూ.38,600 కు చేరింది. అదే సమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పెరుగుదలతో రూ.37,400 కు ఎగసింది. బంగారం ధర పెరిగితే
వెండి ధర కూడా పైకి చేరింది. కేజీ
వెండి ధర రూ.70 పెరిగింది. దీనితో ధర రూ.48,840 కు చేరింది.
పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు గల కారణం. ఇక పోతే
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.
కానీ
అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం బంగారం ధర తగ్గింది. ఔన్స్కు 0.22 శాతం తగ్గుదలతో 1,469.95 డాలర్లకు తగ్గింది. అదే సమయంలో
వెండి ధర ఔన్స్కు 0.32 శాతం తగ్గుదలతో 16.97 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్కు 1,550 డాలర్లకు) చేరిన విషయం అందరికి తెలిసిన విషయమే. బంగారం ధరల పై ప్రభావం చూపే అంశాలు ప్రస్తుతం చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్
మార్కెట్ పసిడి ధరల్లో మార్పు,
కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ
మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి వివిధ అంశాలు
పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.