ఇటీవల ప్రస్తుతం, ఆన్లైన్ మోసాలు అధికంగా జరుగుతుండగా, వాటిలో ముఖ్యంగా వినియోగదారుల నిర్లక్ష్యం ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే, ఇప్పుడు ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి ఎస్బిఐ ఖాతాదారులకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా హెచ్చరిక జారీచేసింది. అసలు ఏమని హెచ్చరించిందనే విషయానికి వెళితే, తమ అకౌంట్ లకు సంబంచిన వివరాలైనటువంటి, బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్ లేదా వారి బ్యాంక్ ఖాతాకు సంబంచిన మరే ఇతర వివరాలనైనా సరే అందరికి తెలిసేలా పబ్లిగ్గా ఎటువంటి సోషల్ మీడియాలోనైనా సరే షేర్ చేసినట్లయితే, అటుతరువాత జరిగే నష్టాలకు తాము ఎటువంటి బాధ్యత వహించమని ప్రకటన చేసింది.


అలాగే, దీని గురించి పూర్తిగా వివరిస్తూ, బ్యాంక్ ఎప్పుడూ కూడా కస్టమర్ల అకౌంట్ లకు సంబంధించిన వివరాలను ఎప్పుడు అడగదని తెలిపింది. అందులోనూ, ఓటిపి లేదా యుపిఐ కి సంభందించిన వివరాలు అడిగే అవసరం కూడా లేదని పేర్కొంది. దీని గురించి మాట్లాడుతూ, " దయచేసి గుర్తుచుకోండి, ఎస్బిఐ లేదా అందులోని అధికారులు కానీ మీ అకౌంటుకు సంబంధించిన అత్యంత సున్నితమైన వివరాలైనటువంటి, యూజర్ ఐడి, సెక్యూరిటీ పిన్ లేదా ఇంటర్నెట్ పాస్వర్డ్ వంటి వాటిని అడగరని, వాటితో వారికీ ఎటువంటి అవసరం ఉండదని మరియు ఫోన్ కాల్, ఎస్ఎం ఎస్ లేదా ఇమెయిల్ ద్వారా ఈ వివరాలను అడిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని" వివరించింది.


వాస్తవానికి, గత కొద్దికాలంగా కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును దండుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదేమిటంటే, మీ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, దాన్ని బ్లాక్ చెయ్యకుండా ఉండాలంటే కొన్ని వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుందని, అందులో మీ అకౌంట్ నంబర్ తో సహా మీ సున్నితమైన పిన్ వంటి వివరాలను కూడా ఇవ్వవలసి ఉంటుందని ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా మెసేజిలను పంపుతున్నారు. వాటిని నమ్మి వాటిపైన క్లిక్ చేసి వివరాలను అందించిన వారి ఖాతాల నుండి డబ్బంతా ఊడ్చేస్తున్నారు. అందుకోసమే. ఎస్ బిఐ తన ఖాతాదారుల శ్రేయస్సు కోసం ఈ హెచ్చరికలను జారీచేసినట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: