ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా కస్టమర్ల కోసం రుణ మేళా కార్యక్రమాన్ని ప్రకటించింది. తక్షణమే లోన్ మంజూరి సేవలను అందిస్తున్నట్లు నిన్న (శుక్రవారం) ప్రకటించింది. ఈ రుణ మేళా కార్యక్రమం పేరు 'మహా లోన్ ధమాకా'. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 2,000 రుణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు ఐసీఐసీఐ ప్రకటించింది.
ఇందులో అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల వద్దకు తీసుకువచ్చింది. ఈ రుణ మేళాలో వ్యక్తిగత, వాహన, బంగారు రుణాలతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డ్లను కూడా ఈ క్యాంప్స్ ద్వారా జారీ చేయనున్నట్లు వివరించింది. అయితే ఈ
బ్యాంక్ లోన్ మేళా రెండు రోజుల పాటు కొనసాగుతుంది. క్యాంప్ జరిగే చోటుకి అర్హులైన కస్టమర్లు వచ్చి అవసరమైన డక్యుమెంట్లు తీసుకువెళ్లి వెంటనే లోన్ అప్రూవల్ తీసుకోవచ్చు.
అయితే తొలి లోన్ క్యాంప్
గుజరాత్ లో ప్రారంభమైంది. అలాగే
హోమ్ లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డుల కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. లోన్ తీసుకుంటే ఏడాది పాటు 'గానా.కామ్, సోనీ లైవ్' సబ్స్క్రిప్షన్ ఫ్రీ గా పొందవచ్చు. గోల్డ్ లోన్స్పై 2 లక్షలపైనా 50 శాతం ప్రాసెసింగ్ ఫీజు తగ్గింపు,
హ్యుందాయ్ మోటార్స్
ఇండియా కార్లపై ప్రత్యేక ఆఫర్లు వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.
హ్యుందాయ్ మోటార్స్ వంటి కంపెనీలతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం మేరకు కస్టమర్లు కాకపోయినా ప్రత్యేక ఆఫర్లతో రుణ మేళా వద్ద రుణాలను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్యాంప్స్ ఉండనున్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీ అనుప్ బాగ్చి పేర్కొన్నారు. లోన్ తీసుకోవాలి అనుకునే వారికీ ఇది చాలా ఈజీ.