మోదీ  సర్కార్  కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో తీపికబురు తీసుకొని వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాన్ని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ  ఈ వేతన పెంపు  అందరికీ వర్తించదు అని అధికారులు తెలుపుతున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంది అని సర్కార్ తెలుపుతుంది. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది కేవలం  ఇండియన్ రైల్వేస్ నాన్ గెజిటెడ్ మెడికల్ ఎంప్లాయీస్‌కు మాత్రమే వేతన పెంపు వర్తిస్తుంది అని అన్నారు. ఈ మేరకు రైల్వే బోర్డు వేతన పెంపునకు ఆమోదం తెలియ చేయడం జరిగింది. 


ఇక ఎనిమిది కేటగిరిల్లో నాన్ గెజిటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ ప్రమోషన్ తర్వాత వీరికి కనీస వేతన పెంపు రూ.5,000 ఉంటుంది అని అన్నారు. ప్రమోషన్‌తో హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), డియర్‌నెస్ అలవెన్స్ (DA), ట్రావెలింగ్ అలవెన్స్ (TA) వంటివి పెరుగుదలలో వస్తాయి అని తెలిపారు. ఇలా తెలిపిన  8 కేటరిగి నాన్ గెజిటెడ్ మెడికల్ ఇండియన్ రైల్వేస్ ఎంప్లాయీస్‌లో స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ స్టాఫ్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, ఫిజియోథెరఫిస్ట్, డైటీషియన్ వంటి ఉద్యోగులు చాల మంది ఉన్నట్లు తెలుస్తుంది.


ఇక జోనల్ రైల్వేస్, సంబంధిత విభాగాలతో సంప్రదింపుల తర్వాత నాన్ గెజిటెడ్ కేటగిరిలోని ఉద్యోగుల ప్రమోషన్‌పై నిర్ణయం తీసుకున్నామని రైల్వే బోర్డు తెలియచేయడం జరిగింది. కానీ మెడికల్ ల్యాబొరేటరీ కేటగిరీస్‌లో కేడర్ స్ట్రక్చర్ రివ్యూ ఇంకా ఫైనాలైజ్ కాలేదని తెలుపుతున్నారు. ఇది పూర్తియిన తర్వాత వీరికి కూడా ఏవీసీ వర్తిస్తుందని అధికారులు తెలుపుతున్నారు. ఇక ఉద్యోగుల లెవెల్ 1 నుంచి లెవెల్ 2కు లేదా లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి ఇలా ప్రమోషన్ ద్వారా ఒక స్థాయి పైకి చేరితే అప్పుడు సదురు ఉద్యోగి వేతనం కనీసం రూ.5,000 పెరుగుతుందని పూర్తి వివరాలతో తెలియచేయడం జరిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: