మరో తీపికబురు కేంద్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సంఘటిత రంగ ఉద్యోగులు, కార్మికులు అందరికీ ఒకే రోజున వేతనాలు అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని కోసం ‘ఒకే దేశం.. ఒకే రోజు వేతనం’ అనే విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాన్ని  కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలియ చేయడం జరిగింది. ‘దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని కార్మికులకు ప్రతి నెలా ఒకే రోజు వేతనం అందించేందుకు  ప్రయత్నాలు కూడా చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని వివరించడం జరిగింది. త్వరలోనే ఈ విధానానికి ఆమోదం లభిస్తుంది అని తెలియచేయడం జరిగింది.

 

ఇదే కాకుండా వివిధ రంగాల్లో మినిమమ్ శాలరీ (కనీస వేతనం) అంశంపై కూడా చర్చిస్తున్నామరి సంతోష్ గంగ్వార్ తెలియచేయడం జరిగింది. ఒకే రకమైన నిబంధనలు తీసుకువస్తము అని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు అందరికి  ప్రయోజనం లభిస్తుందని అన్నారు. మోదీ సర్కార్ ఆక్యూపెషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ (ఓఎస్‌హెచ్) కోడ్‌, కోడ్ ఆన్ వేజెస్‌లను అమలులోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ ఇప్పటికే కోడ్ ఆన్ వేజెస్‌కు ఆమోదం కూడా తెలిపిన సంగతి తెలుస్తుంది. 

 

ఓఎస్‌హెచ్ కోడ్ అమలు అయితే ఉద్యోగంలో చేరినపుడు కంపెనీ కచ్చితంగా అపాయింట్‌మెంట్ లెటర్ అందించడం, ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్‌కు ఫీజు చెల్లించడం వంటి పలు లాభాలు పొందవచ్చు సులువుగా. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి కార్మిక చట్టాలను సరళతరం చేయాలని భావిస్తున్నారని సంతోష్ గంగ్వార్ అన్నారు. ఉపాధి కల్పనలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని గంగ్వార్ తెలిపారు. ఈ రంగంలో దాదాపు 90 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలియాచేయడం జరిగింది.

 

అసంఘటిత రంగంలోని వారికి నెలకు రూ.3,000, మెడికల్ కవరేజ్ అందించాలని మోదీ సర్కార్  నిర్ణయం తీసుకోవడం జరిగింది అని తెలిపారు.  అసంఘటిత రంగంలోని కార్మికుల సామాజిక ఆర్థిక భద్రత కోసం రానున్న కాలంలో మరిన్ని పథకాలు అమలులోకి తీసుకొని వస్తాము అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: