ప్రపంచం మొత్తం మీద మొబైల్ డేటా అత్యంత చౌకగా పొందుతున్నది భారతీయులే. కానీ, ఇప్పుడు ఆ ధరలు కాస్త పెరుగుతున్నాయి.వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ సంస్థలు రెండూ కలిసి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దాదాపు రూ. 71 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయి.మార్కెట్‌లో ఆదాయపరంగా ఈ రెండు కంపెనీల వాటా సగానికిపైనే ఉంది.

 

భారత్ ధరల పట్ల సున్నితంగా ఉండే మార్కెట్ కావడంతో టారిఫ్‌లు విపరీతంగా పెరిగే అవకాశాలు తక్కువేనని నిపుణులు అంటున్నారు.పశ్చిమ దేశాలతో లేదా కొరియా, జపాన్, చైనా లాంటి దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు చాలా తక్కువ. ఒక వేళ ధరలు పెరిగినా, ఆ దేశాల దరిదాపుల్లోకి మాత్రం రావు.భారతదేశంలో అత్యంత చౌకగా మొబైల్ డేటాను అందిస్తున్న సంస్థగా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో.. తన పోటీ సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల బాటలోనే ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.

 

టెలికాం ఆపరేటర్లకు ఆదాయాన్ని ప్రభుత్వం పంచుకునే విధానం కూడా నష్టాలకు ఓ కారణం.చౌక ధరల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు సంస్థలకు ఉపయోగపడే నాన్-టెలికాం ఆదాయాలపైనా ప్రభుత్వం పన్నులు విధిస్తోంది. అంటే ఆస్తుల అమ్మకం, డిపాజిట్లపై వచ్చే వడ్డీ లాంటివి.టెలికాం సంస్థలు ఈ విధానంపై అభ్యంతరం చెబుతున్నాయి. టెలికాం సేవలపై వచ్చే ఆదాయంలో మాత్రమే ప్రభుత్వం వాటాను తీసుకోవాలని వాదిస్తున్నాయి.

 

ఈ విషయానికి సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.డిసెంబర్ 1 నుంచి పెంచుతున్న టారిఫ్‌లను అమలు చేస్తామని వొడాఫోన్ ఐడియా గురువారం ప్రకటించింది.''భారత్‌లో మొబైల్ డేటాకు డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నా, ధరలు ప్రపంచంలోకెల్లా అత్యంత చవగ్గా ఉన్నాయి. ప్రపంచ స్థాయి డిజిటల్ అనుభవాలను వినియోగదారులు ఇలాగే ఆస్వాదించే విధంగా టారిఫ్‌ల్లో తగిన మార్పులు చేస్తాం'' అని పేర్కొంది.ఎయిర్‌టెల్ కూడా ఇలాంటి ప్రకటననే విడుదల చేసింది.కొత్త టారిఫ్ రేట్లు ఎంత వరకూ ఉంటాయన్నది మాత్రం స్పష్టం చేయలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: