ప్రస్తుతం ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరికి కీలకమైన డాక్యుమెంట్ లో ఇది కూడా ఒకటి ఉంది. ఆధార్ కార్డు  ఐడెంటిటీ ప్రూఫ్‌గా పనిచేస్తుంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. అయితే ఆధార్ కార్డులో కొన్ని సందర్భాల్లో తప్పులు ఉండవచ్చు. వీటికి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో మళ్లీ అప్డేట్  చేసుకునే అవకాశం ఉంటుంది.

 

ఆన్‌లైన్‌లోనే అన్ని వివరాలను అప్‌డేట్ చేసుకోలేం కదా. అందుకని కొన్ని సందర్భాల్లో ఆధార్ సెంటర్‌కు పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డులను జారీ చేసే యూఐడీఏఐ సంస్థ ఆధార్ యూజర్లకు తీపికబురు ఇచ్చింది. ఆధార్ సేవా కేంద్రాలు ఇకపై వారంలో అన్ని రోజులు తెరిచే ఉంటాయి అని తెలియచేయడం జరిగింది. యూఐడీఏఐ ఇప్పటికే ఆధార్ సెంటర్లను వారంలో అన్ని రోజులు తెరిచే ఉండాలని ఆర్డర్లు జారీ కూడా చేయడం జరిగింది. 

 

దీంతో మీరు ఏ రోజైనాసరే ఆధార్ సెంటర్‌కు వెళ్లి వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఆధార్ సెంటర్లు మంగళవారం క్లోజ్ చేసి ఉండేవి. కానీ ‘ఆధార్ సేవా కేంద్రాలు ఇప్పుడు 7 రోజులు తెరిచే ఉంటాయి. ఇవి రోజుకు 1000 మందికి సేవలు అందించడం జరుగుతుంది. ఎన్‌రోల్‌మెంట్ లేదా వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు’ అని యూఐడీఏఐ తెలియచేయడం జరిగింది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల మాదిరిగానే ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లోనే ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. కొత్త ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవడంతోపాటు ఇక్కడ ఇతర సేవలు కూడా సులువుగా పొందవచ్చు.

 

పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వంటి వివరాలను సరిచేసుకోవచ్చు. ఫోటో, బయోమెట్రిక్ డేటా (ఫింగర్‌ప్రింట్, ఐరిష్) అప్‌డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం 19 ఆధార్ సేవా కేంద్రాలు యూజర్లకు అందుబాటులో ఉండడం జరిగింది. 2019 చివరకు దేశవ్యాప్తంగా 53 పట్టణాల్లో 114 సెంటర్లను ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ భావిస్తోంది. దగ్గరిలోని ఆధార్ సెంటర్‌ ఇలా తెలుసుకోవచ్చు.. దగ్గరిలో ఆధార్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. https://appointments.uidai.gov.in/bookappointment.aspx?AspxAutoDetectCookieSupport=1 లింక్ ద్వారా ఆధార్ సెంటర్ తెలుసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: