నిన్నటికి నిన్న 20 రూపాయిలు పెరిగిన బంగారం ధరలు ఈరోజు మళ్ళి దిగొచ్చాయి. ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటికి నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర ఈరోజు భారీగా దిగొచ్చింది. తులం బంగారం 35 వేల దిశగా పతనం అవుతున్న సమయంలో తగ్గుదలకు ఒక్కసారిగా నిన్న బ్రేకులు పడ్డాయి. 

 

అయితే ఈరోజు మాత్రం బ్రేక్ కి మరో బ్రేక్ వేసి బంగారం ధర తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో నేడు శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయిల తగ్గుదలతో 39,390 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 30 రూపాయిల తగ్గుదలతో 36,110 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. 

 

హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 46,150 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె  కొనసాగుతున్నాయి. 

 

ఢిల్లీ మార్కెట్ లోను పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిల తగ్గుదలతో  38,050 రూపాయలకు చేరింది. కాగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయిలు తగ్గుదలతో 36,850 రూపాయలకు చేరింది. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా బంగారం, వెండి తగ్గుతూ వస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేయడం కూడా ఇన్వెస్టర్లను బంగారం పెట్టుబడులకు దూరం చేసింది రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. ఎందుకంటే రేపు మళ్ళి ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి.  

మరింత సమాచారం తెలుసుకోండి: