పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడు వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన పెట్రోల్ డీజల్ ధరలు తగ్గుతాయి అని అందరూ భావిస్తే దానికి వ్యతిరేకంగా పెట్రోల్ డీజల్ ధరలు పెరిగాయి. అయితే ఇప్పుడు పెట్రోల్ ధర 80 రూపాయిలు అయ్యింది. దీంతో నేడు హైదరాబాద్ లో 12 పైసలు పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర రూ.79.73కు వద్దకు చేరగా డీజిల్ ధర కూడా 14పైసలు పెరుగుదలతో రూ.71.93కు చేరాయి.

 

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అమరావతిలో 20 పైసలు పెరుగుదలతో పెట్రోల్ ధర 79.47 రూపాయలకు దగ్గరకు చేరగా, డీజిల్ ధర కూడా 16 పైసలు పెరుగుదలతో 71.25 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 78.90 రూపాయలకు చేరగా.. డీజల్ ధర కూడా 5 పైసలు పెరుగుదలతో 70.80పైసల్ వద్దకు చేరింది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 74.66 రూపాయిల దగ్గర, డీజిల్ ధర 65.73 రూపాయిల వద్ద కొనసాగుతుంది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది.       

 

 అయితే గత మూడు వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 4 రూపాయిలు పెరిగింది. పైసలు రూపంలో పెరుగుదల వాహనదారులకు కనిపించడం లేదు కానీ... నిజానికి పెట్రోల్, డీజల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెట్రోల్ డీజల్ ధరలు పెరగడంతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు కేవలం మూడు వారాలలో 80 రూపాయిలు అయ్యింది. ఇలాగె ఉంటె ఇంకొక నెలలో 90 రూపాయిలు లీటర్ పెట్రోల్ అవుతుంది 
మరి ఈ పెట్రోల్, డీజల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: